భద్రాద్రి కొత్తగూడెం : విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శనివారం భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. నరేంద్ర మోదీ (Narendra Modi ) తెలంగాణ పర్యటన (Telangana Tour)ను వ్యతిరేకిస్తూ వరంగల్లో నిర్వహించిన నిరసన ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambashiv Rao) ను మరికొందరిని పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ నిరసన ప్రదర్శన, రోడ్డుపై బైఠాయింపు కార్యక్రమాలు నిర్వహించారు. గో బ్యాక్ మోదీ అంటూ నినాదాలు చేశారు.
నిరసన ప్రదర్శనలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలోని బయ్యారం (Bayyaram ) స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీల, నవోదయ కేంద్రీయ విద్యాలయాల పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ (Coach Factory ) మంజూరు చేయాలని, సింగరేణి, బ్యాంకులు, ఐఎస్ఎన్ఎల్,ఎల్ఐసీ, ఉక్కు, రక్షణ రంగాలను ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పే చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరారు. సీబీఐ, ఈడీ ఎలక్షన్ కమిషన్ సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.