హైదరాబాద్ : పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ది కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్స్(CPGET)-2021 సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. అకడమిక్ ఇయర్ 2021-22లో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయూ-హెచ్లో PG (MA, MSc, MCom, etc.,), PG డిప్లోమా అదేవిధంగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రొగ్రామ్స్(MA, MSc, MBA)కు ప్రవేశాలను ఆహ్వానిస్తుంది. మొత్తం 53 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహణ జరగనుంది.
ఈ ఏడాది మహత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీలు MPEd కోర్సులకు ప్రవేశాలను ఆహ్వానిస్తున్నాయి. పాలమూరు వర్సిటీ హిస్టరీ సబ్జెక్టుకు, జేఎన్టీయూ-హెచ్ మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ప్రవేశాలను ఆహ్వానిస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ట్రైబల్ వేల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ నాగర్ కర్నూలు, షాద్నగర్లోని తన రెండు కాలేజీల్లో ఐదేళ్ల MSc Chemistry ఇంటిగ్రేడెట్ ప్రొగ్రాంను ప్రవేశపెట్టింది.
ప్రవేశ పరీక్ష 90 నిమిషాల పాటు కొనసాగనుంది. ప్రశ్నాపత్రం 100 బహుళ ఐశ్చిక ప్రశ్నలను కలిగి ఉంటుంది. పూర్తి వివరాలకు అభ్యర్థులు www.osmania.ac.in, www.tscpget.com, www.ouadmissions.com, www.cpget.tsche.ac.in కు లాగినై చూడాల్సిందిగా అధికారులు పేర్కొన్నారు.