హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నెల రోజులుగా కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ సూచించింది. పలు సూచనలు చేస్తూ తాజాగా లేఖ రాసింది. జూలై 29తో ముగిసిన వారంలో 712 కేసులు నమోదైతే.. ఈ నెల 5వ తేదీతో ముగిసిన వారంలో 908 కేసులు వెలుగుచూశాయని చెప్పింది. ఎక్కువగా కేసులు నమోదయ్యే జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పింది. కొవిడ్ కేసుల నియంత్రణకు ఐదెంచెల వ్యూహం.. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం, కొవిడ్ జాగ్రత్తలు పాటించేలా చూడాలని స్పష్టం చేసింది.