హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కొవిడ్ సమయంలో, హైదరాబాద్ వరదల సమయంలో సర్వస్వం కోల్పోయిన నిరుపేదలను ఆదుకొనేందుకు స్వచ్ఛందంగా సేవలందించిన ఎనిమిదిమంది ప్రముఖులను తెలంగాణ ఉర్దూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం ఉంటుందని ఉర్దూ పరిరక్షణ సమితి అధ్యక్షుడు మహ్మద్ ఆరిఫ్ అహ్మద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీరాజ్ డిప్యూటీ సెక్రటరీ అయేషా ముసర్రత్ ఖానం, మహిళా విశ్వవిద్యాలయం వీసీ డాక్ట ర్ విద్యులత, యూరాలజిస్ట్ డాక్టర్ మాజిద్ ఆదిల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నజ్మా సుల్తానా, డీఎంహెచ్వో శ్రీనివాస్రావు, షాహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ అబ్దుల్ ఖదీర్ను సత్కరించనున్నట్టు తెలిపారు.