నాంపల్లి కోర్టులు, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, మాజీ డీజీపీ మహేందర్రెడ్డిపై ఎలాంటి అనుచిత వాఖ్యలు చేయరాదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులోని 11వ అదనపు జడ్జి ఆర్ డ్యానీరుత్ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
హైకోర్టు న్యాయవాది రాపోలుభాస్కర్పై మహేందర్రెడ్డి దాఖలుచేసిన పరువునష్టం కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ పరువుకు భంగం కలిగించేలా వ్యాఖలు చేయరాదని, వీడియో, ఆడియోలను, వ్యాసాలను, సభల్లో సమావేశాల్లోకానీ, ఇంటర్యూల్లో, సామాజిక మాధ్యమాల్లో, టీవీ ఛానళ్లలో పత్రికాముఖంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని ఆదేశించింది.
తనపై న్యాయవాది చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, పేరు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లేవిధంగా తప్పుడు ఆరోపణలు చేశారని పిటిషనర్ కోర్టుకు వివరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారని తెలిపారు. దీంతో తదుపరి విచారణ పూర్తయ్యేవరకు సంయమనం పాటించాలని రాపోలు భాస్కర్కు కోర్టు సూచించింది. తదుపరి విచారణను మార్చి 11వ తేదీకి వాయిదా వేసింది.