వరంగల్ చౌరస్తా, డిసెంబర్21: వరంగల్(Warangal) ఎంజీఎం దవాఖాన(MGM Hospital)లో కరోనా(Corona )కేసులు నమోదయ్యాయన్న పుకార్లు(rumors) సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో రోగులు, అటెండెంట్లు ఆందోళనకు గురయ్యారు. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన 41 ఏళ్ల మహిళ కరోనా లక్షణాలతో ఎంజీఎం కొవిడ్ వార్డులో చేరిందని, నగరానికి చెందిన మరో ముగ్గురిని సైతం అనుమానితులుగా గుర్తించినట్లు వాట్సాప్లో సమాచారం చక్కర్లు కొట్టింది.
దీంతోపాటు వారి నుంచి నమూనాలు సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపంచినట్లు తప్పుడు వార్తలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు ఎంజీఎం కొవిడ్ వార్డులో ఎలాంటి అనుమానితులు గానీ, కరోనా జేఎన్1 లక్షణాలు ఉన్న వారు గానీ నమోదు కాలేదని అన్నారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలను అనుసరించి 50 పడకలతో కొవిడ్ వార్డును ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.