హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): కౌమారుల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చే యాలని సీఎస్ సోమేశ్కుమార్ కోరారు. విద్య, వైద్యారోగ్యశాఖ సహా అన్ని శాఖ లు సమన్వయంతో పనిచేయాలన్నారు. యుక్తవయస్సులో రక్తహీనతలాంటి ఆరోగ్య సమస్యలు, బాల్యవివాహాల్లాం టి సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం యూనిసెఫ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)తో చేతులు కలిపింది. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన వర్క్షాప్కు హాజరైన సీఎస్.. కౌమార సాధికారతపై ఐఈసీ ప్యాకేజీని విడుదల చేశారు.