కమలాపూర్, అక్టోబర్ 3: ఇంట గెలిచి.. రచ్చ గెలువాలంటారు.. కానీ, బీజేపీ నేత ఈ టల రాజేందర్ సొంత గ్రామమైన కమలాపూర్లో కనీసం ఆర్టీసీ బస్టాండ్ నిర్మించలేకపోయారు. బస్టాండ్ నిర్మించాలని గ్రామస్తులు, ప్రయాణికులు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు ఈటల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఈటల రాజీనామాతో అభివృద్ధి ఆగిపోతుందన్న ప్రజలకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. కమలాపూర్లో బస్టాండ్ నిర్మాణానికి రూ.1.70 కోట్లు కేటాయించారు. శిథిలావస్థకు చేరిన పీహెచ్సీ భవనాన్ని కూల్చివేసి, ఆ స్థలంలో బస్టాండ్ నిర్మించేందుకు పనులు చకచకా సాగుతున్నాయి.