CSE | హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): సీఎస్ఈగా పిలిచే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్కు ఇప్పుడు క్రేజ్ పెరుగుతున్నది. పాలిటెక్నిక్లో ఇది హాట్కేకులా మారింది. రాష్ట్రంలో పాలిసెట్ తొలి విడత కౌన్సెలింగ్లో నిండిన సీట్లే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. పాలిసెట్ తొలి విడత సీట్లను సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఆదివారం కేటాయించారు. ఈ ఏడాది 80,358 మంది పాలిసెట్కు క్వాలి ఫై అయ్యారు. వీరిలో 25,160 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా 21,367 మం ది సీట్లను దక్కించుకున్నారు. వీరిలో అత్యధికులు సీఎస్ఈనే ఎంచుకోవడంతో 90.38 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
రాష్ట్రంలోని నాలుగు కాలేజీల్లో 100% సీట్లు నిండిపోగా, వీటిలో రెండు ప్రభుత్వ కాలేజీలున్నాయి. ఈ ఏడాది గిరిజన రిజర్వేషన్ను 10% పెంచడం తో ఆ మేరకు గిరిజనులకు సీట్లు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 580 మంది సీట్లు దక్కించుకున్నారు. సీట్లు పొందిన వారు 29లోగా ఫీజు చెల్లించాలని సాంకేతిక విద్యాశాఖ ఇన్చార్జి కమిషనర్ వాకాటి కరుణ సూచించారు. జూలై 7 నుంచి విద్యాసంవత్స రం ప్రారంభమవుతుంది. 14వ తేదీ వరకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించి 15 నుంచి రెగ్యులర్ తరగతులు ప్రారంభిస్తారు.
ఈ ఏడాది ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు అరకొకగా నిండగా, ప్రభుత్వ కాలేజీలకు అధిక డిమాండ్ నెలకొన్నది. కౌన్సెలింగ్లో ప్రభుత్వ కాలేజీల్లో 87.44% సీట్లు భర్తీ అయితే.. ప్రైవేట్ కాలేజీల్లో 60.46% భర్తీ అయ్యాయి. ప్రభుత్వ కాలేజీల్లోని 13వేల సీట్లల్లో మొదటి విడతలోనే 11వేల సీట్లు నిండాయి. మొదటి విడత కౌన్సెలింగులో 8వేలకు పైగా సీట్లు మిగలగా, జూలై 1 నుంచి ప్రారంభమయ్యే తుది విడత కౌన్సెలింగులో ఈ సీట్లను భర్తీచేస్తారు.