చండీగఢ్: భారత్ ఇటీవల ఫ్రాన్స్ నుంచి సమకూర్చుకున్న అత్యాధునిక యుద్ధ విమానం రాఫెల్ను పంజాబ్కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ స్ఫూర్తిగా తీసుకున్నారు. రాఫెల్ జెట్ను పోలిన ఆకారంలో ఒక వాహనాన్ని తయారు చేశారు. దానికి ‘పంజాబ్ రాఫెల్’ అని పేరుపెట్టారు. అయితే ఇది గాలిలో ఎగురలేదు. రోడ్డుపై గంటకు 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
బతిందా రామ మండికి చెందిన ఆర్కిటెక్ట్ రామ్ పాల్ బెహనివాల్ రాఫెల్ను పోలిన ఒక వాహనాన్ని రూపొందించారు. ముందు భాగంలో పైలట్ స్థానంలో డ్రైవర్, వెనుక వైపు మరో పైలట్ స్థానంలో చిన్న పిల్లలు కూర్చొనే విధంగా దీన్ని తయారు చేశారు. ఈ విమాన వాహనం నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఖర్చు చేశారు. రాఫెల్ జెట్ విమానం మాదిరిగా కనిపించేందుకు నీలం రంగు పెయింట్ వేశారు. దాని బోనెట్పై ‘రామ్ పాల్ ఎయిర్లైన్’ అని రాశారు. ఆయన మొబైల్ ఫోన్ నంబర్లు కూడా అక్కడ పేర్కొన్నారు.
రాఫెల్ జెట్ వాహనాన్ని త్వరలో సాంస్కృతిక ఉద్యానవనం వద్ద ప్రదర్శిస్తానని దీన్ని నిర్మించిన రామ్ పాల్ తెలిపారు. నిజమైన విమానం ఎక్కలేని వారు దీనిపై ప్రయాణించి ఆనందించవచ్చని చెప్పారు. రాఫెల్ జెట్ విమానాలను స్ఫూర్తిగా తీసుకుని దీనికి ‘పంజాబ్ రాఫెల్’ అని పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు.