హైదరాబాద్: తెలంగాణ మూడో శాసన సభ సమావేశాలు (Assembly Session) ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం ఆయన స్పీకర్ను కలిశారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణం చేశారు. తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసదుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు.