హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి (6, ఆగస్టు) సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నివాళి అర్పించారు. ఉమ్మడి పాలనలో నాడు తెలంగాణకు జరిగిన నష్టాలను, కష్టాలను వివరిస్తూ, తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలను, ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని ప్రొఫెసర్ జయశంకర్ రగిలించారని సీఎం కేసీఆర్ స్మరించుకొన్నారు. జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగించి, మొకవోని దీక్షతో సాహసోపేత పోరాటం చేసి స్వరాష్ర్టాన్ని సాధించుకొన్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జయశంకర్ సార్ ఆశించినట్టుగానే స్వయంపాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ, సకల జనుల అభ్యున్నతిని సాధిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ కలను సాకారం చేస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.
‘స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష’
‘నేడు ఏది విడిచినా రెండు విడిచిపెట్టను. ఒకటి శనివారం ఉపవాసం. రెండోది తెలంగాణ వాదం’
‘యాచిస్తే వచ్చేది భిక్షం- పోరాడితే సంక్రమించేది హక్కు’
‘యాచించే దశ నుంచి శాసించే దశకు తెలంగాణ చేరాలి’
– ప్రొఫెసర్ జయశంకర్