హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఆయన పర్యటన కొనసాగింది. ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు ఒక ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండలం, రెడ్డికుంట తండా పర్యటన ముగియగానే సీఎం కేసీఆర్ బస్సులో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడే బస్సును కాసేపు ఆపి ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం చేశారు. సీఎం కేసీఆర్తోపాటు ఇతర మంత్రులు, అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భోజనం వడ్డించారు. భోజనంలో పులిహోర, పెరుగన్నం ఉన్నాయి. భోజనానంతరం సీఎంతోపాటు అందరూ అరటిపళ్లు తిన్నారు. ఆ తర్వాత సీఎం హెలిక్యాప్టర్ ద్వారా వరంగల్, కరీంనగర్ పర్యటనలకు బయలుదేరి వెళ్లారు. మహబూబాబాద్ పర్యటన కంటే ముందే ఆయన ఖమ్మం జిల్లాలో కూడా పర్యటించారు.
సీఎం కేసీఆర్ ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించారు. మహబూబాబాద్ పర్యటన ముగియగానే బస్సులో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడే బస్సును ఆపి ఇంటి నుంచి తెచ్చుకున్న సద్ది బోజనం చేశారు. సీఎంతోపాటు మంత్రులు, రాష్ట్ర అధికారులకు ఎర్రబెల్లి భోజనం వడ్డించారు pic.twitter.com/C6wfQjHRob
— Namasthe Telangana (@ntdailyonline) March 23, 2023