హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ సమైక్యతా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శనివారం ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేరుగా గన్పార్క్కు చేరుకొని, అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్గార్డెన్కు చేరుకొన్నారు. పబ్లిక్గార్డెన్లో సీఎం కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి స్వాగతించారు. పోలీస్ బ్యాండ్ ఘన స్వాగతం పలికింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ఉత్సవాల్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు, ఎంపీలు దీవకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, అసద్దుద్దీన్ ఓవైసీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, దానం నాగేందర్, ముఠా గోపాల్, జీవన్రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, సురభి వాణీదేవి, పాడి కౌశిక్రెడ్డి, ఆర్టీఐ ప్రధాన కమిషనర్ బుద్దా మురళి, కమిషనర్లు కట్టా శేఖర్రెడ్డి, గుగులోత్ శంకర్నాయక్, మహ్మద్ అమీర్, ఖలీలుల్లా, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, కార్పోరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, గజ్జల నగేశ్, రావుల శ్రీధర్రెడ్డి, దూదిమెట్ల బాలరాజు, అనిల్ కూర్మాచలం, మేడె రాజీవ్సాగర్, టీఆర్ఎస్ నేతలు రాకేశ్, బాబా ఫసియుద్దీన్, టీఎస్పీఎస్సీ సభ్యుడు కారం రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.