హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. మానవ మనుగడకు మొకలు తప్పనిసరి అని, మానవ జీవితంలో మొకలు నాటడమే అతి గొప్పపనని పేర్కొన్నారు. మొకలు పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకుసాగుతున్నదని చెప్పా రు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించే లక్ష్యంతో ప్రచురించిన మట్టిచిగురు పుస్తకాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్లో ఆవిషరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం తమ ప్రాణాల ను ఫణంగా పెట్టి, విజయం సాధించిన సా మాన్యుల అసమాన్య ధీరోదాత్త గాథలు, నిత్యం స్ఫూర్తిదాయకంగా ఉండేలా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారని ప్రశంసించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నాటిన చిట్టి మొలకలతో పెరుగుతున్న వృక్షసంపద, పర్యావరణ పరిరక్షణను ఈ పుస్తకంలో తెలియజేశారని చెప్పారు. చిపో ఉద్యమకారుడు సుందర్లాల్ బహుగుణ, స్వచ్ఛ విత్తనాల కోసం గళమెత్తిన వందనాశివ, నర్మదాబచావో ఆందోళన, తెహ్రీడ్యామ్ వ్యతిరేక ఉద్యమం, పాండురంగహెగ్డే చేపట్టిన అప్పికో ఆందోళన, రాజేంద్రసింగ్ చేపట్టిన జోహడ్ పథకం, గూగుల్పై ఆకుపచ్చని గీతగా నిలిచిన వనజీవి రామయ్య, రోడ్డు పొడవునా మొకలు నాటిన సాలుమరద తిమ్మక, 1,360 ఎకరాల అడవిని పెంచిన జాదవ్పాయెంగ్ లాంటి పర్యావరణ ఉద్యమకారుల కృషిని ఈ పుస్తకం తెలియజేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, శంకర్నాయక్, మట్టిచిగురు పుస్తక సంపాదకుడు జూలూరు గౌరీశంకర్, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో-ఆర్డినేటర్ రాఘవ పాల్గొన్నారు.