హైదరాబాద్ : టీఆర్ఎస్ సీనియర్ నేత కావేటి లక్ష్మీనారాయణ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. కావేటి మరణంతో నిబద్ధత కలిగిన నేతను పార్టీ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీ నారాయణ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని సీఎం పేర్కొన్నారు. కావేటి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.