హైదరాబాద్ : ఎంబీసీ సిద్దాంతకర్త, సామాజిక అభ్యుదయవాది, కోలపూడి ప్రసాద్ ( కోప్రా ) మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తను నమ్మిన విలువల కోసం అహర్నిశలు పాటుపడిన కోప్రా మరణంతో, అత్యంత వెనక బడిన వర్గాలు తమలో ఒక గొప్ప మేథావిని కోల్పోయినట్టయిందని విచారం వ్యక్తం చేశారు. కోప్రా కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నెల్లూరు జిల్లాకు చెందిన కోలపూడి ప్రసాద్ గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం కన్నుమూశారు. మెదడు రక్త నాళాల్లో రక్తం గడ్డి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోప్రాకు భార్య నిర్మల, ఒక పాప ఉన్నారు.