హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్, సభ్యులను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు గురువారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
కమిషన్ చైర్మన్గా బకి వెంకటయ్య (ఎస్సీ మాల, మెదక్ ), సభ్యులుగా కుస్రం నీలాదేవి (ఎస్టీ గోండు, ఆదిలాబాద్), రాంబాబు నాయక్ (ఎస్టీ లంబాడా, దేవరకొండ), కొంకటి లక్ష్మీనారాయణ (ఎస్సీ మాదిగ, కరీంనగర్), జిల్లా శంకర్ (ఎస్సీ మాదిగ, నల్లగొండ), రేణికుంట ప్రవీణ్ (ఎస్సీ మాదిగ, ఆదిలాబాద్) నియామకయ్యారు. సభ్యుల ఎంపికపై ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.