చిట్యాల, సెప్టెంబర్ 2: నడుస్తున్న ప్రైవేట్ బస్సు మంటలు అంటుకొని దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో 65వ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాతి జరిగింది.
హైదరాబాద్ నుంచి చీరాలకు బయల్దేరిన ఓ ప్రైవేట్ బస్సు గురువారం అర్ధరాతి 1:30 గంటలకు పెద్దకాపర్తి శివారులోకి చేరుకోగానే టైర్ పేలింది. దాంతో మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. వెంటనే డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికులను కిందికి దింపడంతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు.