హైదరాబాద్ : ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజెటి రోశయ్య పార్థీవదేహానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబీకులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోశయ్య మరణం బాధ కలిగించిందన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్త నుంచి సీఎం, గవర్నర్ స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తని కొనియాడారు. కళలు, సాహిత్యంపై అభిమానం ఉన్న వ్యక్తన్నారు. ఆయన సేవలు మరువలేనివని, అన్ని పదవులకు వన్నె తీసుకువచ్చారన్నారు.