హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : సివిల్ సర్వీసెస్-2023 మెయిన్స్ ఫలితాలను శుక్రవారం యూపీఎస్సీ విడుదల చేసింది. క్యాటగిరీల వారీగా ఫలితాలను రిలీజ్ చేసింది. మొత్తం 2,884 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, వీరిలో తెలుగు రాష్ర్టాల నుంచి 100 మంది ఉన్నారు. వీరిలో స్వామి (ఆంత్రోపాలజీ), రవిరాల (సోషియాలజీ), ఎన్ఎస్ ఐశ్వర్య (సోషియాలజీ), చందన (సోషియాలజీ), సాయినాథ్ (ఆంత్రోపాలజీ), కే శశికాంత్ (ఆంత్రోపాలజీ), సూర్యప్రకాశ్రెడ్డి (ఆంత్రోపాలజీ), కే అర్పిత (పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్), జీ సాయి దర్శిని (ఆంత్రోపాలజీ), చౌహన్ రాజ్కుమార్ (పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్), ధీరాజ్ రెడ్డి (ఆంత్రోపాలజీ), అనన్య రెడ్డి (ఆంత్రోపాలజీ)లు ఉన్నారు. వీరితోపాటు మిగతావారందరికీ త్వరలోనే ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఫలితాలను వెల్లడిస్తామని యూపీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఇంటర్వ్యూ తేదీలను వెల్లడిస్తామని పేర్కొన్నాయి. సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు మెయిన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.