దుబాయ్: బర్మింగ్హామ్ వేదికగా వచ్చే ఏడాది జరిగే ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్కు భారత్తో సహా ఆరు జట్లు అర్హత సాధించాయి. నాలుగేండ్లకోసారి జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత్తో పాటు ఆతిథ్య హోదాలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ నుంచి ఒక జట్టు ఆడుతుంది. ఏప్రిల్ 1న వెలువడిన ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా కామన్వెల్త్ గేమ్స్కు జట్లు అర్హత సాధించాయి.