హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): విదేశాల్లోనూ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన అనిల్ కూర్మాచలానికి సముచిత స్థానం కల్పించిన సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ ఎన్నారై సెల్ మలేషియా అధ్యక్షుడు చిట్టిబాబు చిరుత కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్గా అనిల్ కూర్మాచలాన్ని నియమించి తెలంగాణ ఉద్యమంలో, స్వరాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి అయిన ఎన్నారైకి సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అనిల్ కూర్మాచలానికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ మలేషియా ఉపాధ్యక్షుడు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బోయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, గద్దె జీవన్కుమార్, రమేశ్ గౌరు, సందీప్కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావు నడిపెల్లి, రఘునాథ్ నాగబండి, రవీందర్రెడ్డి, హరీశ్ గుడిపాటి, నవీన్ తదితరులు ఉన్నారు.