సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి మంగళవారం చింతా ప్రభాకర్(Chinta Prabhakar) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా(Resigned )లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపారు. సెప్టెంబర్ 28, 2022 న చింతా ప్రభాకర్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్ గెలిచిన విషయం తెలిసిందే. కాగా, నిన్న రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో పనిచేస్తామని ప్రకటించారు.
బోయినపల్లి వినోద్ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
సోమా భరత్కుమార్, రాష్ట్ర డెయిలీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
జూలూరి గౌరీ శంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్
దూదిమెట్ల బాలరాజు, గొర్రెలు, మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్
రవీందర్సింగ్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్
కే వాసుదేవరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్,
మన్నె క్రిశాంక్, టీఎస్ఎండీసీ చైర్మన్
గెల్లు శ్రీనివాస్, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్
పల్లె రవికుమార్, గీతవృత్తిదారుల సహకార సంస్థ చైర్మన్
పాటిమీద జగన్మోహన్రావు, టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్
అనిల్ కూర్మాచలం, ఫిలిం డెవల్పెమంట్కార్పొరేషన్ చైర్మన్
గజ్జెల నగేశ్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్
మేడే రాజీవ్సాగర్, టీఎస్ఫుడ్స్ చైర్మన్
ఆంజనేయగౌడ్, శాక్స్ చైర్మన్
వై సతీశ్రెడ్డి, రెడ్కో చైర్మన్
రామచంద్రనాయక్, ట్రైకార్ చైర్మన్
గూడూరు ప్రవీణ్, టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్
వాల్యానాయక్, జీసీసీ చైర్మన్