హైదరాబాద్, డిసెంబర్ 11: రాష్ట్ర యాం టి నార్కొటిక్స్ బ్యూరోలో ఎస్పీగా పనిచేస్తున్న గుమ్మి చక్రవర్తిని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తాత్కాలిక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నియమించారు. ఈ మేరకు డీజీపీ రవి గుప్తా సో మవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నియా మకం తక్షణమే అమల్లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా చక్రవర్తి కొనసాగుతారని తెలిపారు. తదనుగుణంగా ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేసుకోవాలని యాంటి నార్కొటిక్స్ బ్యూరో డైరెక్టర్కు స్పష్టం చేశారు.