హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రైతురుణాల మాఫీ కోసం ప్రభుత్వం 19,446 కోట్లు కే టాయించిందని, మాఫీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. రుణమాఫీ పొందిన రైతులకు వెంటనే కొత్తగా పంట రుణాలు అందించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభు త్వ కార్యక్రమాల ప్రగతిపై కలెక్టర్లతో ఆమె బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రైతులకు సరిపడా ఎరువు లు అందుబాటులో ఉన్నాయని, ఈ ఎరువుల పంపిణీ సక్రమంగా సాగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
జీవో 58 కింద స్వీకరించిన దరఖాస్తులను వారంలోగా పట్టాలను అందజేయాలని ఆదేశించారు. చనిపోయిన భర్త స్థానంలో వెం టనే భార్యకు పింఛన్ మంజూరు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మం జూరు చేసిన 5707 కొత్త జీపీల భవనా లు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఆ యిల్ పామ్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆ ర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావు, ఎస్సీ అభివృద్ధి కార్యదర్శి రాహుల్ బొజ్జా, రవాణా, రోడ్డు భవనాల ప్రత్యేక కార్యదర్శి విజయేంద్ర తదితరులు పాల్గొన్నారు.