హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): వన్యప్రాణుల రక్షణకు యూనియన్ బ్యాంకు అందజేసిన రెస్యూ వెహికిల్ను గురువారం అరణ్యభవన్లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వన్యప్రాణులు, పక్షులను కాపాడేందుకు అటవీశాఖ సరికొత్త రక్షణ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. సామాజిక బాధ్యతలో భాగంగా సెక్రటేరియట్ కేంద్రంగా పని చేస్తున్న యూనియన్బ్యాంక్ శాఖ సుమారు రూ.10 లక్షలతో ఈ వాహనాన్ని సమకూర్చిందని చెప్పారు.