హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, శ్రీవేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఐదు రోజులపాటు విశాఖ శారదా పీఠంలో చతుర్వేద హవనం నిర్వహించనున్నారు. శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులతో లోక కల్యాణం కోసం ఈ హవనం నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో 32 మంది వేద పండితులు, శాస్త్ర పండితులు పాల్గొంటారు. శారదాపీఠంలో హవనం యజ్ఞ వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల వేదిక ఏర్పాట్లను టీటీడీ జేఈవో సదా భార్గవి సోమవారం పరిశీలించారు. అనంతరం స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.