హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు నాగమణి దంపతుల హత్య కేసులో నిందితుల వివరాలు, కేసు దర్యాప్తు తో కూడిన ఛార్జీషీటును పోలీసులు మంథని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో గురువారం సమర్పించారు. ఛార్జిషీట్లో పేర్కొన్న దర్యాప్తునకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా ఇదే కేసులో ప్రధాన నిందితులుగా అరెస్టైన కుంట శ్రీనివాస్, శ్రీమంతుల చిరంజీవి, అక్క పాక కుమార్ లు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్లను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరావు తిరస్కరించారు.