కమాన్చౌరస్తా, ఏప్రిల్ 29: జేఈఈ మె యిన్ ఫలితాల్లో తమ విద్యాసంస్థల విద్యార్థి పీ రాకేశ్ 12వ ర్యాంకు సాధించాడని అల్ఫో ర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి చెప్పారు. గతంలో తాము 18వ ర్యాంకు సాధించామని, ఇప్పుడు మరింత ఉత్తమ ర్యాంకు సాధించామని అన్నారు. తమ విద్యాసంస్థలు రాష్ట్రస్థాయి ర్యాంకులకు కేరాఫ్గా నిలుస్తున్నాయని చెప్పారు. కరీంనగర్లోని అల్ఫోర్స్ టైనిటాన్స్ క్యాంపస్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను శనివారం ఆయన సత్కరించారు. జేఈఈ మెయి న్ ఫలితాల్లో మారుతి 228, ఇషాంత్రెడ్డి 250, అభిరామ్ 448, సుహాసితరెడ్డి 480, సాత్విక్ 511, హర్షవర్ధన్ 520, రాహుల్ 554, అరుణ్ 624, ఏ శివసాయిచరణ్ 634, శివమణి 680, డీ వివేకవర్ధన్ 748, రాజుకుమార్ 805, శ్రీనివాస్ 939వ ర్యాంకుతోపాటు మరెన్నో మెరుగైన ర్యాంకు లు సాధించినట్టు వివరించారు. వెయ్యిలోపు 14 ర్యాంకులు, 5000 లోపు 40, 10000 లోపు 70 ర్యాంకులు సాధించినట్టు వివరించారు. కరీంనగర్ జిల్లాలో నాణ్యమైన విద్యను అందిస్తూ, హైదరాబాద్ స్థాయిలో ఉత్తమ మార్కులు సాధిస్తున్నామని చెప్పారు.