హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్గా గోలి శ్రీనివాస్రెడ్డి, సభ్యురాలిగా భూక్యా జ్యోతి (ఎస్టీ విభాగంలో) నియమితులయ్యారు. ఈ మేరకు సివిల్ సప్లయ్ కమిషనర్ అనిల్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరూ ఐదేండ్లు ఈ పదవిలో కొనసాగనున్నారు.