హైదరాబాద్ : వరంగల్ కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ ఆయూష్ కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో ధ్రువీకరణపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లకు విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎండీ ఆయుర్వేదం, హోమియోపతి, యూనాని కోర్సుల్లో సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను యూనివర్సిటీ ప్రకటించింది.
హైదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కేంద్రంలో మార్చి 3న హాజరై అభ్యర్థులు ధ్రువీకరణపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎండీ హోమియో కోర్సుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉదయం 9 గంటలకు, ఆయుర్వేదం ఉదయం 11 గంటలకు, యునానికి సంబంధించిన అభ్యర్థులు మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్రానికి రావాలని యూనివర్సిటీ సూచించింది. వివరాలకు www.knruhs.telangana.gov.inలో సంప్రదించాలని సూచించింది.