న్యూఢిల్లీ: ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత కే కేశవరావు స్పష్టంచేశారు. ధాన్యం సేకరణపై గందరగోళానికి సభలోనే తెరపడాలని, కేంద్ర వ్యవసాయ మంత్రి దీనిపై సభలో ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగాక ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలన్నారు. తాము ప్రతిపక్షంతో ఉన్నామని, రాజ్యసభలో 12 మంది విపక్ష పార్టీల సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కేకే కోరారు.