హైరిస్క్పర్సన్ల గుర్తింపు ప్రక్రియ వేగవంతం
మహబూబ్నగర్టౌన్, జూన్ 6 : హైరిస్క్పర్సన్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. మున్సిపాలిటీలోని రైతుబజార్, కూరగాయల మార్కెట్, చికెన్ వివిధ దుకాణాల్లో పని చేస్తున్న హైరిస్క్పర్సన్ల వివరాలను మున్సిపల్, మెప్మా సిబ్బంది సేకరించి టీకా వేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 438మందిని గుర్తించి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చారు. అలాగే 300మందికి టీకా వేశారు. బాలుర కళాశాల, కలెక్టరేట్ సమీపంలోని ఎక్స్ప్లో ప్లాజా సెంటర్, మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో హైరిస్క్పర్సన్లకు కొవిడ్ టీకా వేస్తున్నారు. ఆదివారం మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ వ్యాక్సిన్ సెంటర్లను పరిశీలించారు. మరో రెండు, మూడో రోజులు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.