జనగామ రూరల్ : అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై కక్ష గట్టి ప్రభుత్వాన్ని పడకొట్టాలనే దురుద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP Government) నాటకాలాడుతోందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(Mla Muthi reddy) ఆరోపించారు. బుధవారం జనగామ జిల్లా(Janagama district) కేంద్రంలోని ఆర్ఆండ్బీ గెస్ట్హౌస్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీ స్వార్థం(BJP Selfishness) కోసం ప్రశ్నాపత్రాన్ని కావాలనే లీక్ చేయుంచి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఆ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల మానసిక క్షోభకు కారణమవుతున్న ఇలాంటి వారికి శిక్షపడేవరకు వదిలిపెట్టవద్దని అనేక మంది ఫోన్లు చేస్తున్నారని పేర్కొన్నారు. పేపర్ లీక్(Paper Leak) కారకులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.
బుర్రం ప్రశాంత్ పేపర్ లీక్ చేసి సోషల్ మీడియాతో పాటు బీజేపీ పార్టీ అధ్యక్షుడికి వేయడం వెనుక ఉన్న వారందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని చట్టపర చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి ఉన్నాడని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ వెల్లడించాడని గుర్తు చేశారు.