హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ కీలక నిర్ణ యం తీసుకుంది. హత్యకు ముందు ఆయన రాసినట్టుగా చెప్తున్న లేఖపై ఎవరెవరి వేలిముద్రలు ఉ న్నాయో గుర్తించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా నిన్హైడ్రిన్ (లేఖపై ఉన్న వేలిముద్రలను అనుమానితులు, నిందితుల వేలిముద్రల తో పోల్చి నిజాన్ని నిర్ధారించేందుకు జరిపే రసాయ న చర్య) పరీక్షకు అనుమతించాలని కోరుతూ సీబీఐ కోర్టులో అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అభిప్రాయాలు తెలపాలని నిందితులను ఆదేశించిన కోర్టు.. ఈ అంశంపై జూన్ 2న విచారణ జరపనున్నది. వివేకా హత్యాస్థలిలో లభించిన లేఖను అధికారులు 2022 ఫిబ్రవరి 11న ఫోరెన్సిక్ పరీక్షలకు పం పారు. ఆ లేఖను ఒత్తిడిలో రాసినట్టు సీఎఫ్ఎస్ఎల్ నివేదికలు తేల్చడంతో ఆ లేఖపై ఉన్న వేలిముద్రలను గుర్తించాలని సీబీఐ నిర్ణయించింది. అందుకోసం నిన్హైడ్రిన్ పరీక్ష నిర్వహించాలని సీఎఫ్ఎస్ఎల్ను కోరింది. వివేకా హత్య కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న ఈ లేఖకు నిన్హైడ్రిన్ పరీక్ష నిర్వహిస్తే ఆ లేఖపై ఉన్న చేతిరాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలా జరిగిన పక్షంలో ఈ కేసు దర్యాప్తు, విచారణకు విఘాతం కలగకూడదన్న ఉద్దేశంతోనే సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఒరిజినల్ లేఖ బదులు కలర్ జిరాక్స్ను రికార్డులో భద్రపరిచి, దాన్ని సాక్ష్యంగా పరిగణించేందుకు అనుమతించాలని పిటిషన్లో కోరారు. వివేకాతో బలవంతంగా లేఖను రా యించినట్టు అప్రూవర్ దస్తగిరి తన వాంగ్మూలంలో పేర్కొన్నాడని సీబీఐ ఇప్పటికే కోర్టుకు తెలిపింది.
నిన్హైడ్రిన్ పరీక్ష అంటే..
సేంద్రియ రసాయన శాస్త్రంలో మూలక సమ్మేళనాలను విశ్లేషించేందుకు వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో రసాయనిక ప్రతిచర్యతో కూడిన నిన్హైడ్రిన్ పరీక్ష ఒకటి. వివేకా లేఖపై అమైన్లు లేదా అమినో ఆమ్లాలు ఉన్నాయో లేదో తేల్చేందుకు జరిపే ఈ పరీక్షలో ప్రధాన ప్రతిచర్య జరిపే పదార్థం నిన్హైడ్రిన్. ఇది ‘సీ9హెచ్604’ రసాయన ఫార్ములాతో కూడిన ఓ హైడ్రోకార్బన్. నిన్హైడ్రిన్ను 2,2-డైహైడ్రాక్సిన్డైన్-1,3-డియోన్’ అని కూడా పిలుస్తారు. పరీక్షించాల్సిన (శాంపిల్) సమ్మేళన ద్రావణానికి నిన్హైడ్రిన్ కలుపుతారు. ఆ తర్వాత ఆ ద్రావణం ముదురు నీలం రంగులోకి మారితే ఆ శాంపిల్లో అమినో ఆమ్లాలు, అమైన్లు, అమ్మోనియా ఉన్నట్టే.