హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బషీర్బాగ్లోని జీఎస్టీ భవన్లో సోమవారం సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తున్నది. ఈ తనిఖీల్లో కస్టమ్స్ అండ్ యాంటీ ఎవేషన్స్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడినట్టు సమాచారం. బిల్లులు మెయింటెయిన్ చేయని పలు షాపులు, కంపెనీల నుంచి కస్టమ్స్ అధికారులు లంచాలు డిమాండ్ చేసినట్టు ఫిర్యాదులు రావడంతో సీబీఐ ఈ సోదాలు చేపట్టినట్టు తెలుస్తున్నది. పట్టుబడిన ఇద్దరు అధికారుల ఆస్తుల వివరాల గురించి అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.