మహిళల దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుం చి రూ.6.5 లక్షల విలువైన 13 తులా ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ అహ్మదాబాద్ జిల్లాలోని జమలాపూర్కు చెంది న పతాన్యాసిన్ ఖాన్ రెడీమెడ్ దుస్తులను విక్రయిస్తుంటాడు. గుజరాత్లో ఐదేండ్ల క్రితం దృష్టి మళ్లించి దొంగతనాలు చేయగా వడోదర పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత గుజరాత్లో తన సహచరుడు ఆనంద్ ఆశోక్ భాయ్తో కలిసి దొంగతనాలు చేశాడు. అలాగే మహారాష్ట్ర, తెలంగాణ రాష్ర్టాల్లోని ప్రధాన పట్టణాల్లో మహిళల దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడ్డాడు.
పతాన్యాసిన్ ఖాన్ బిజీగా ఉండే మార్కెట్ ప్రాంతాలను ఎంచుకొని, ఒంటరిగా ఉండే మహిళల వద్దకు వెళ్తాడు. తను పలుకుబడి, డబ్బున్న వారి వద్ద పనిచేస్తున్నానని.. వాళ్ల ఇంట్లో ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నారని.. మీరు వచ్చి తీసుకెళ్లాలని అని కోరుతాడు. అతని మాటలు నమ్మి కొద్ది దూరం వెళ్లిన తరువాత.. మీ ఒంటిపై ఆభరణాలున్నాయని.. తమ యజమాని చూస్తే పేదలు కాదనే ఆలోచన వస్తుందని.. వాటిని తీసి దాచిపెట్టండి అంటూ ఒక పేపర్ లేదా రూ. 500 నోటు లో చుట్టి ఆమెకు అందించినట్లు నటిస్తూ.. అదే సమయంలో బాధితురాలి దృష్టి మళ్లిం చి.. తన వద్ద ఉన్న కవర్ను ఆమెకు అందిస్తాడు. కొద్ది దూరం తీసుకెళ్లిన తర్వాత బాధితురాలికి ఓ ఇల్లు చూపించి.. అక్కడి నుంచి పరారవుతాడు.
బాధితురాలు ఇంటికి వెళ్లి చూసేసరికి అందులో రాళ్లు, కాగితపు ముక్కలు కన్పిస్తాయి. ఇలా మోసపోయిన చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయా రాష్ర్టాల్లో కేసులు నమోదయ్యాయి. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడిని సౌత్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర బృందం, మహంకాళి పోలీసులతో కలిసి పట్టుకున్నారు. మూడు పోలీస్ కమిషనరేట్లతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఇలాగే దృష్టి మళ్లించి 17 చోట్ల దొంగతనాలు చేసినట్లు విచారణలో నిందితుడు వెల్లడించాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి.. అతని వద్ద నుంచి 13 తులాల బం గారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు ఆనంద్ అశోక్ భాయ్ పరారీలో ఉన్నాడు. అనంతరం ఈ కేసు దర్యాప్తును మహంకాళి పోలీసులకు అప్పగించారు.