హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ ఇతర రాష్ర్టాల్లో దొంగిలించిన కార్లను ఓఎల్ఎక్స్ ద్వారా తక్కువ ధరకు అమ్ముతున్న ఘరానా ముఠాను సీసీఎస్ స్పెషల్ జోనల్ టీమ్ అరెస్ట్ చేసింది. వారి వద్ద నుంచి రూ.3.5 కోట్ల విలువైన 12 కార్లను స్వాధీనం చేసుకుంది. సీసీఎస్ డీసీపీ శ్వేత కథనం ప్రకారం.. కార్తీక్, షేక్ అబ్దుల్లా, మహ్మద్ ఫిరోజ్, షేక్ షాహిద్అలీ, గాంధీ శివకుమార్, లవన్కుమార్, మహ్మద్ తౌసిఫ్ ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకు కార్ల గురించి సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మదన్పల్లికి చెందిన సోను, సైఫ్ అలీ, బెంగళూరుకు చెందిన సయ్యద్లు.. కార్తీక్ను ఫోన్లో సంప్రదించి ఒప్పందం ప్రకారం కార్లను డెలివరీ చేశారు. వాహనాల తనిఖీల్లో గుట్టు బయటపడింది. ఆరుగురిని ఈ నెల 20న అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా లవన్కుమార్ను అరెస్ట్ చేశారు.