హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థల్లో 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 77,449 మంది దరఖాస్తు చేసుకోగా 69,230 (89.39 శాతం) మంది హాజరయ్యారని ఎంజేపీ గురుకులాల కార్యదర్శి డాక్టర్ మల్లయ్యభట్టు తెలిపారు. 6వ తరగతికి 36,335 మంది దరఖాస్తు చేసుకోగా 32,590 మంది, 7వ తరగతికి 21,764 మంది దరఖాస్తు చేసుకోగా 19,327 మంది, 8వ తరగతికి 19,350 మంది దరఖాస్తు చేసుకోగా 17,313 మంది విద్యార్థులు హాజరయ్యారు.