C TET | హైదరాబాద్ : ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీపడే వారికి నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీ టెట్) పరీక్ష ఆదివారం(మార్చి 20) నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.