ఆర్మూర్టౌన్, ఫిబ్రవరి 21: కండక్టర్ కోసం హారన్ కొట్టిన బస్సు డ్రైవర్పై ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో బుధవారం చోటుచేసుకున్నది. ఆర్మూర్ డిపోకు చెందిన డ్రైవర్ నర్సయ్య ఉదయం బస్సును తీసుకొచ్చి బస్టాండ్ ప్లాట్ఫామ్పై నిలిపాడు. కండక్టర్ రావడం లేదని హారన్ కొడుతుంటే.. అక్కడే ఉన్న ప్రయాణికులు డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కొందరు అతడిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆర్టీసీ సిబ్బంది అక్కడికి చేరుకుని సర్దిచెప్పారు. డ్రైవర్పై దాడిని నిరసిస్తూ మిగతా డ్రైవర్లు, సిబ్బంది బస్సులు నిలిపివేసి బస్టాండ్లో నిరసన తెలిపారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే తమపై భౌతికదాడులకు దిగడం సిగ్గుచేటని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.