KTR | హైదరాబాద్ : ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంతో మందికి చేయూతనిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పదో తరగతి పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు కేటీఆర్ చిరు కానుక అందించారు. తన నియోజకవర్గం రాజన్న సిరిసిల్లకు చెందిన ఓ 3 వేల మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులను అందజేశారు. వారందరికీ కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ.. ఇచ్చింది చిన్న కానుకే కానీ.. ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
గతేడాది మార్చి నెలలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 2 వేల మంది విద్యార్థులకు కేటీఆర్ డిజిటల్ ట్యాబ్లను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.
Small gesture may be, but something that made me 😊
Sent these to the 3 thousand youngsters of 10th grade in my constituency appearing for their board exams
Wishing them all the best pic.twitter.com/T0M7brk9zm
— KTR (@KTRBRS) February 26, 2024