నేరేడుచర్ల, ఆగస్టు 26 : పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ జలదోపిడీ చేస్తున్నా రేవంత్ ప్రభుత్వానికి పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ హు జూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటె ద్దు నర్సింహారెడ్డి ఆరోపించారు. నాగార్జునసాగర్ నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, నేరేడుచర్లలో రైతు మహాధర్నా చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులతోపాటు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
నే రేడుచర్ల చౌరస్తాలో నిర్వహించిన రైతు ధర్నాలో గరిడేపల్లి, పాలకవీడు, నేరేడుచర్ల మండలాలకు చెందిన రైతులు, హుజూర్నగర్లో నిర్వహించిన ధర్నాలో మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపా లెం, హుజూర్నగర్ మండలాలకు చెందిన రైతు లు పాల్గొన్నారు. ఆంధ్రా జల దోపిడీని అరికట్టాలని, సాగర్నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని, సారే కావాలని, కారే రావాలని పెద్ద ఎత్తున నినదించారు. ఆయా కార్యక్రమాల్లో ఒంటెద్దు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. మిగులు జలాలను మాత్రమే వాడుకోవాలని నిబంధనలు ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వచ్చిన వరద నీటిని మొత్తం తెలంగాణకు రాకుండా అక్రమంగా తరలించుకుపోతున్నదని మండిపడ్డారు.
ఆంధ్రా సర్కార్ 30 రోజుల్లో కనీసం 40 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోతే తెలంగాణకు కేవలం 9 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేశారని ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ ఉన్న సమయంలో తెలంగాణలోని రైతులు సుఖసంతోషాలతో జీవించారని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గోస పడుతున్నారని తెలిపారు. రైతుల ప్రయోజనాలను పట్టించుకోకుండా తెలంగాణ అస్థిత్వాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. సాగర్ నీరు వస్తుందనే నమ్మకంతో ముందస్తుగా బోర్లు, బావుల కింద నాట్లు వేసిన రైతులు సరిపడా నీరు లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.