హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పార్టీ మారి ఉప ఎన్నిక తీసుకొచ్చారని, ఆయన ఓటమి ఖాయమని బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల స్పష్టం చేశారు. మునుగోడులో టీ ఆర్ఎస్ ఘన విజ యం సాధిస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్గిరి రాపోలు ఆధ్వర్యంలో సిడ్నీలో సమావేశం జరిగింది. దీనికి మహేశ్ బిగాల, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి హాజరయ్యారు. మహేశ్ బిగాల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మునుగోడులో పార్టీని గెలిపిస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలు టీఆర్ఎస్(బీఆర్ఎస్) గురించి చర్చిస్తున్నారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియాశాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి, కమిటీ సభ్యులు వెంకటరమణారెడ్డి, రవీందర్ చింతామణి, పరుశురామ్ తదితరులు
పాల్గొన్నారు.