హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): అమ్మలోని మొదటి అక్షరం ‘అ’, నాన్నలోని చివరి అక్షరం ‘న్న’ కలిపితే ‘అన్న’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావుతో ఉన్న ఫొటోను రాఖీ పండుగ సందర్భంగా గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.
మంత్రి కేటీఆర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. కాగా, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్కు సోదరి సౌమ్యతో కలిసి కవిత రాఖీ కట్టారు. చెల్లెళ్లు తనకు రాఖీలు కట్టిన ఫొటోలను ఎంపీ సంతోష్కుమార్ ట్విట్టర్లో షేర్ చేశారు. ‘అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ’ అని పేర్కొన్నారు.
అమ్మ లోని మొదటి అక్షరం
నాన్న లోని చివరి అక్షరం నా “ అన్న ”@KTRBRS #Rakshabandhan pic.twitter.com/qbSCZOBlbg— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 31, 2023