హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్భూషణ్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. రెజ్లర్ల ఆందోళనలను కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.
కేంద్రం ఇప్పటికైనా కండ్లు తెరిచి, బ్రిజ్భూషణ్పై చర్యలు తీసుకోవాలని బుధవారం ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. రెజ్లర్లు ప్రపంచ వేదికలపై భారత జెండాను రెపరెపలాడించి, దేశానికి కీరిప్రతిష్ఠలు తెచ్చారని కవిత అన్నా రు. పోక్సో అభియోగాలు ఉన్నప్పటికీ నిందితుడు బయటే ఉన్నాడని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి పతకాలు సాధించిన క్రీడాకారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం తగదన్నారు.