Gadari Kishore | హైదరాబాద్ : రాజకీయ వ్యభిచారి సీఎం రమేష్ పెట్టిన అక్రమ కేసులకు భయపడేది లేదు అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ తేల్చిచెప్పారు. తెలంగాణ ఉద్యమంలో 172 కేసులు.. ఆరు నెలలు జైలుకు పోయిన నిఖార్సైన ఉద్యమకారుణ్ణి నేను అని ఆయన స్పష్టం చేశారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సీఎం రమేష్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా హైదారాబాద్లోని తన నివాసం నుండి పోలీస్ స్టేషన్కు బయల్దేరారు.
ఈ సందర్భంగా కిశోర్ మాట్లాడుతూ.. రాజకీయ వ్యభిచారి సీఎం రమేష్ నా మీద అక్రమ కేసు పెట్టాడు. కేటీఆర్ గురించి అసత్య ఆరోపణలు చేసిన సీఎం రమేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ నేను మాట్లాడినందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నాపై కేసు నమోదు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుమ్మక్కయి ఎన్ని కేసులు పెట్టినా మీకు భయపడేది లేదు. మా పార్టీ నాయకుల గురించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే సీఎం అయినా, ఎంపీ అయినా తప్పకుండా తిప్పికొడతాను మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తేల్చిచెప్పారు.