తొర్రూరు/అలంపూర్, ఫిబ్రవరి 13 : జోగుళాంబ గద్వాల అలంపూర్ నియోజకవర్గంలో కారు జోరు కొనసాగింది. అయిజ, అలంపూర్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాదించారు. అయిజలో మొత్తం 20 వార్డులకు గాను బీఆర్ఎస్ 13 స్థానాల్లో గెలుపొంది మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకే పరిమితమైంది. అలంపూర్ మున్సిపాలిటీలో 10 వార్డులకు గానూ 5 వార్డులు బీఆర్ఎస్, 5 వార్డులు కాంగ్రెస్ దక్కించుకున్నాయి.
ఎక్స్అఫీషియో (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ) సభ్యుల ఓటు ద్వారా అలంపూర్ మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం ఉన్నది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇక్కడ 16 వార్డులకు గాను బీఆర్ఎస్ 9 చోట్ల గెలుపొందగా, కాంగ్రెస్ 7 వార్డులకు పరిమితమైంది. చైర్పర్సన్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో హోదాలో స్థానిక ఎమ్మెల్యే ఓటుతో కాంగ్రెస్ బలం 8 అవుతుంది. ఇక్కడ చైర్మన్ స్థానాన్ని బీఆర్ఎస్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది.