KCR | హైదరాబాద్, మార్చి11 (నమస్తే తెలంగాణ): పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతో ప్రజల నడుమ శాంతి సామరస్య భావనలు వెల్లివిరుస్తాయని సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గడచిన పదేండ్ల పాలనలో ప్రగతి, సంక్షేమం సమాహారంగా తెలంగాణ రాష్ట్రాన్ని గంగా జమున తెహజీబ్కు ప్రతీకగా, దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని కేసీఆర్ తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని కేసీఆర్ ప్రత్యేకంగా ప్రార్థించారు.